Friday, March 29, 2024

వివేక్ భౌతికదేహం చూసి చలించిన కోలీవుడ్..తారల కంటతడి..

ప్రముఖ నటుడు వివేక్ ఇకలేరనే వార్త తెలుసుకొన్న సినీ ప్రముఖులు, అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. చెన్నైలోని ఆయన నివాసం వద్ద ఉంచిన వివేక్ భౌతిక కాయానికి శ్రద్దాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొంటూ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వివేక్ మరణం గురించి తలచుకొంటూ కీర్తి సురేష్ ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్‌లో వివేక్ గురించి తలచుకొంటూ.. నాకు అత్యంత ఇష్టమైన కమెడియన్ మనతో లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. సినీ పరిశ్రమలో లెజెండ్ అయిన ఆయనతో నటించే అవకాశం దక్కలేదు. కానీ ఆయనతో ఎన్నో అనుభూతులు పంచుకొన్నాను. ఆయన నాకు చెప్పిన విషయాలు ఎల్లకాలం నా మనసులో ఉండిపోతాయి అంటూ కీర్తి సురేష్ పేర్కొన్నారు.

వివేక్ పార్థీవ దేహాన్ని కడసారి దర్శించుకొన్న తమిళ ప్రముఖుల్లో శరత్ కుమార్, విక్రమ్, డైరెక్టర్ శంకర్, అర్జున్, సిద్దార్థ్, సూర్య, జ్యోతిక, కార్తీ, త్రిష తదితరులు ఉన్నారు. ఓ దశలో సిద్దార్థ్, త్రిష, కీర్తీ సురేష్ కంటతడి పెట్టుకొని శ్రద్దాంజలి ఘటించారు. భారీగా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు.

Ok
Advertisement

తాజా వార్తలు

Advertisement