Friday, March 29, 2024

ఎస్ఐతో సినీ నటి ఎఫైర్ – పంచాయితీ పోలీస్ స్టేషన్ కి

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి. సెలబ్రిటీల విషయంలో అవి వార్తలు గా మారుతున్నాయి. తాజా కోలీవుడ్ కు చెందిన నటి రాధా పోలీస్ స్టేషన్ కు గుమ్మం తొక్కారు. తను ఓ పోలీస్ అధికారి మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. సుందరం ట్రావెల్స్ మూవీతో రాధా కోలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా పుట్టాడు. అయితే కొన్ని విభేదాల కారణంగా కొన్ని ఏళ్ళ క్రితం భార్య భర్తలు విడిపోయారు.

ఈ నేపథ్యంలోనే ఓ సినిమా షూటింగ్ లో ఎస్ ఐ వసంత్ రాజ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధం గా మారింది. కాగా రాధా కారణంగా తన భర్త కుటుంబాన్ని పిల్లలను పట్టించుకోవడం లేదని భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు రాధ వసంత రాజ్ పేరును తనకు భర్తగా బాబుకు తండ్రిగా ఆధార్ కార్డు లో పేరు నమోదు చేయించింది. ఇది తెలుసుకున్న వసంత్ రాజ్ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించారు. దీంతో కావాలనే నన్ను వసంత్ రాజ్దూరం పెడుతున్నారని రాధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement