Thursday, March 28, 2024

ఖిలాడి స్ట్రీమింగ్ రైట్స్.. వారికే !!

లాక్ డౌన్ తర్వాత క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కోరికను కూడా తీర్చింది. ఇక అదే జ్యోష్ తో ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మే 28న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం స్క్రీనింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement