Saturday, April 20, 2024

త్వ‌ర‌లోనే ఓటీటీలో రానున్న కేజీఎఫ్​ 2..

టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని కాదు.. ప్రస్తుతం ఏ చిత్రపరిశ్రమలో అయినా ‘కేజీయఫ్‌ 2’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ‘కేజీయఫ్‌’ అభిమానులకు ఫుల్‌ కిక్‌ ఇచ్చే వార్త ఒక్కటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారట. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మే 13న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

హోంబెల్ ఫిలింస్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. విలన్‌ అధీరా పాత్రను ప్రముఖ బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ పోషించాడు. తమ అభిమాన హీరో చిత్రానికి ఇంతటి ఘన విజయం లభించడం పట్ల యశ్‌ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కి, యశ్‌ యాక్షన్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని స్పందన లభిస్తోంది. తొలిరోజే దాదాపు 135 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డుని సృష్టించింది. అందులో ఒక్క బాలీవుడ్‌లోనే దాదాపు రూ.50 కోట్లను రాబట్టడం మరో విశేషం. ఇలాగే కొనసాగితే.. ఈ వీకెండ్‌లోపే 500 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయం అంటున్నారు సినీ క్రిటిక్స్​..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement