Thursday, April 25, 2024

కేదార్ నాథ్ ఆల‌యంలో కంగ‌నా… విజ‌యేంద్ర‌ప్ర‌సాద్

ప్ర‌ముఖ ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్.. హీరోయిన్ కంగ‌నార‌నౌత్ కేదార్ నాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు.కాగా కైలాసానంద మహారాజ్, ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ కూడా కంగనా వెంట ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కంగనా కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకుంది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా ఆలయ సందర్శన సమయంలో కంగనా సంప్రదాయ నీలిరంగు దుస్తులను ధరించింది. అలాగే గులాబీ రంగు బాంబర్ జాకెట్‌, నుదుటిపై గంధాన్ని పూసుకుని ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన కంగనా.. శివుడి దివ్యశక్తి ఉండే తీర్థయాత్రను సందర్శించడం ఎంత అదృష్టమో అని తన ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫొటోలతో పాటు ఒక వీడియోను షేర్‌ చేసింది కంగనా. హెలికాప్టర్ నుంచి తీసిన ఈ వీడియోలో కేదార్‌నాథ్ దేవాలయం ఏరియల్ వ్యూను చూడొచ్చు.

ఈ సందర్భంగా ‘హర హర మహాదేవ’ అని కంగనా పాడడం మనం చూడొచ్చు. ఎట్టకేలకు కైలాసనంద్ జీ మహారాజ్, విజయేంద్ర ప్రసాద్ లతో కలిసి కేదార్‌నాథ్ ను దర్శించానని, థ్యాంక్యూ ఉమేష్ భయ్యా అని వీడియోకు క్వాప్షన్ రాసింది. సినిమాల విషయానికొస్తే.. కంగనా గత సినిమా ధాకడ్‌ డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాదు ఇక ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలు కూడా కంగనానే తీసుకుంది. ఎమర్జెన్సీ సినిమా కోసం తన ఆస్తులు తాకట్టు పెట్టానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కంగనా. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఎమర్జెన్సీ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement