Monday, March 25, 2024

బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి ఎప్పుడంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. తారక్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో ‘బిగ్ బాస్’ రియాల్టీ షో మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించి షోను సూపర్ సక్సెస్ చేశాడు. తాజాగా ఆయన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాల్టీ గేమ్ షోతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో షూటింగ్ జులై 7 నుంచి ప్రారంభం కానుంది. దీనికోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా సెట్ వేశారు. కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ అనంతరం వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమంలో జెమిని టీవీ చానల్లో ప్రసారం కానుంది.

ఇప్పటికే ఈ షో ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో షో షూటింగ్ ను ప్రారంభించాలని నిర్వహకులు ప్లాన్ చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. షోలో పాల్గొనే కంటెస్టెంట్ లను ఎంపిక చేస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో బీజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డబ్బింగ్ కూడా పూర్తి అయ్యింది. త్వరలో రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement