Thursday, April 25, 2024

జాతిరత్నాలు ఎండింగ్ కలెక్షన్ ఎంతో తెలుసా ?

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రలో అనుదీప్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతిరత్నాలు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ పతాకంపై నాగ అశ్విన్ నిర్మించారు. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మంచి కలెక్షన్లు సాధించింది.

ఇక తాజాగా జాతి రత్నాలు క్లోజింగ్ కలెక్షన్స్ కూడా వచ్చేసాయి. అవి చూసుకుంటే నైజాంలో రూ. 15.7 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.8 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.1 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.9 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.6 కోట్లు, గుంటూరులో రూ. 2.05 కోట్లు, కృష్ణాలో రూ. 1.85 కోట్లు, నెల్లూరులో రూ. 85 లక్షల తో రెండు రాష్ట్రాల్లో రూ. 31.85 కోట్లు షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో 6.1 కోట్లు కలిపి మొత్తం వరల్డ్ వైడ్ గా 37.95 కోట్ల షేర్ వసూలు సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement