Thursday, April 25, 2024

ఇస్మార్ట్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే ?

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ డూపర్ హిట్ ని అందుకొని ఫామ్ లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి పేర్లు తెరపైకి వచ్చాయి కానీ ఈ ఇద్దరు కూడా ప్రస్తుతానికి బిజీ బిజీ గా గడుపుతున్నారు. దీంతో కే జి ఎఫ్ సినిమా తో స్టార్ హీరోగా మారిపోయిన యష్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ యష్ కూడా బిజీ గా ఉండటంతో కన్నడ హీరో దృవ సజ్జ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇటీవల దృవ సజ్జ పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement