Tuesday, March 26, 2024

మన సంగీతాన్ని ప్రజలకు చేరువ చేయడం కష్టమే.. విజ‌య్ యేసుదాసు

త‌న‌కంటూ సొంత బాటను నిర్మించుకోవడం ఎంతో కష్టమైంద‌న్నారు గాయ‌కుడు జేసుదాసు కుమారుడు విజ‌య్ యేసుదాసు. సాధారణంగా ప్రజలు దీన్ని సులభమైనదిగా భావిస్తారు. విజయవంతమైన తల్లి లేదా తండ్రి పరిశ్రమలో ఉంటే మార్గం సులభమవుతుంది అంతే అని విజయ్ యేసుదాసు చెప్పారు. తనను గాయకుడిగా కంటే కూడా నటుడిగానే ఎక్కువ మంది గుర్తిస్తారని పేర్కొన్నారు. మీ కంటూ సొంత సంగీతం సృష్టించుకోవడం కష్టమైన టాస్క్. మీ సంగీతానికి ప్రజలు చేరుకునేలా చేయడం కష్టం. నేడు టిక్ టాక్ మాదిరి ఎన్నో ప్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్నాయి’’అని విజయ్ తెలిపారు. 300కు పైగా సినిమా పాటలు పాడిన విజయ్ యేసుదాసు ఎన్నో తమిళ సినిమాల్లో నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. రెండు రోజల ఇండియాటుడే కాంక్లేవ్ సౌత్ కార్యక్రమం గురువారం కోవళంలో ప్రారంభమైంది. ఈ కార్య‌క్ర‌మంలో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. వీరు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోనున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కమల్ హాసన్, రాణా దగ్గుపాటి, శోభిత దూళిపాళ్ల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement