Saturday, April 20, 2024

రాధే శ్యామ్ కథ ఇదే ?

ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యూరప్ బ్యాక్ డ్రాప్ పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ టైంలో ఈ సినిమాకు సంబంధించి కథ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూరప్ లో చాలా ఏళ్ళ క్రితం ట్రైన్ మిస్ అయింది. అప్పట్లో దాని గురించి ఎంత వెతికినా దొరకలేదట. మళ్లీ ఆ ట్రైన్ మెక్సికోలో ప్రత్యక్షమైందట.

అయితే ఆ ట్రైన్ ఎలా వెళ్ళింది అని ఎవరికీ తెలియ రాలేదట. రాధేశ్యామ్ సినిమాలోనూ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే ప్ర‌యాణిస్తున్న రైలు ఓ గుహ‌లోకి వెళ్ల‌గానే కనిపించకుండా కుండా పోతుందట. అప్పుడు అలా ఆ ఇద్దరు 1970 బ్యాక్‌డ్రాప్‌లోకి వెళ్తారు. అక్క‌డ వారి మ‌ధ్య పుట్టే ప్రేమ‌.. ఇత‌ర విష‌యాల‌తో సినిమా పీరియాడిక‌ల్ స్టైల్లో ఉంటుంద‌ని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement