Thursday, March 28, 2024

రాఖీ2.0….ఎన్టీఆర్ తో కృష్ణవంశీ చేస్తాడా ?

టాలీవుడ్ దర్శకులు కృష్ణవంశీ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసే కృష్ణవంశీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో గతంలో రాఖీ సినిమా చేశాడు. ఈ సినిమాలో ముఖ్యంగా ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోర్టు సీన్స్, జైలు సీన్, రైల్వే స్టేషన్ లో చెప్పే డైలాగ్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా నటన పరంగా ఎన్టీఆర్ ను ఒక అడుగు పైకి లేపాయి.

అయితే ఎన్టీఆర్ నటనను హైలైట్ చేస్తూ కృష్ణవంశీకి ట్వీట్ చేశాడు ఓ నెటీజన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరైన సబ్జెక్టు. పాన్ ఇండియన్ సబ్జెక్ట్ ఇది. రాఖీ 2.0 తీయండి అంటూ కృష్ణవంశీకి ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ కు స్పందించిన కృష్ణవంశీ చెల్లి చనిపోయిన బాధలో సమాధి దగ్గర ఉండే సీన్ గురించి కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. నాకు ఇష్టమైన సీన్స్ లో ఇదొకటి. షూట్ చేసేటప్పుడు నా నరాలు కట్ అవుతున్నట్లు అనిపించాయి. ఎన్టీఆర్ పాత్రకు ప్రాణం పోసి… ఆ సీను ఎక్కడికో తీసుకెళ్లారు. అది గుర్తు చేసినందుకు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ రాఖీ 2.0 మాత్రం క్లారిటీ ఇవ్వలేదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement