Friday, April 19, 2024

జగన్ ని కలవబోతున్న ఇండస్ట్రీ పెద్దలు

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లు నిలిచిపోయాయి. అలాగే థియేటర్స్ కూడా మూతపడ్డాయి. దీంతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. దీంతో నిర్మాతలు భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతుండటంతో… సినిమాలను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఏపీలో మాత్రం టిక్కెట్ ధరలను ప్రభుత్వం ఫిక్స్ చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి కి ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఎక్కడా రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement