Monday, March 25, 2024

“ఇన్ టూ వరల్డ్ ఆఫ్ విరూపాక్ష”.. స్నీక్ పీక్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్

డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “విరూపాక్ష”. ఈ సినిమాని వచ్చే నెల (ఏప్రిల్) 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రమోషన్స్ కూడా మోదలు పెట్టేశారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ & టీజర్ వీడియోలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. కాగా, తాజాగా మేకర్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

“ఇన్ టూ వరల్డ్ ఆఫ్ విరూపాక్ష” అంటూ మేకర్స్ చిన్న స్నీక్ పీక్ వీడియోను రిలీజ్ చేశారు. రెండు నిమిషాల ఒక సెకను నిడివి కలిగి ఉన్న వీడియో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెస్తుంది. రుద్రవనంలోని మోదమాంబా టెంపుల్ కి సంబంధించిన సెట్స్ ను వీడియోలో చూపించడం జరిగింది. సినిమా కోసం సాంకేతిక నిపుణులు ఎంతగా కష్టపడ్డారు అనేది వీడియోను చూస్తే అర్థం అవుతుంది. వీడియో మొదట్లో కనిపించే బుక్ పై వాల్యూమ్ 1 అని కనిపిస్తోంది. అంటే ఈ సినిమా రెండు భాగాల్లో విడుదల కానున్పట్టు అర్థం అంవుతుంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement