Friday, April 26, 2024

మ‌లేషియాలో.. విజ‌య్ సేతుప‌తి మూవీ

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా.. మ‌రో కొత్త చిత్రం స్టార్ట్ అయింది. అరుముగ కుమార్ దర్శకత్వంలో హీరోగా విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం మలేషియాలో ఐపోహ్‌ సిటీలోని ఓ ఆలయంలో జరిగింది. 7Cs Entertaintment బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నాడు. విజయ్‌సేతుపతి 51 గా ప్రొడక్షన్‌ నంబర్‌ 5గా రాబోతున్న ఈ చిత్రంలో రుక్మిణి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న మేరీ క్రిస్మస్‌లో విజయ్‌ సేతుపతికి జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తుంది. ఈ సినిమాను టిప్స్‌ ఫిలింస్‌, మ్యాచ్‌ బాక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement