Friday, March 29, 2024

నేను తల్లిని అయ్యాను….ప్రభాస్ హీరోయిన్

లీడర్, మిరపకాయ, మిర్చి ,నాగవల్లి, భాయ్ వంటి చిత్రాలలో నటించి తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది రీచా గంగోపాధ్యాయ. అయితే 2019లో తన స్నేహితుడు జోయ్ లాంగెల్లాను ను వివాహం చేసుకుంది. అయితే రిచా గంగోపాధ్యాయ ఈ రోజు ఉదయం తాను తల్లిని అయ్యానంటూ ఇంస్టాగ్రామ్ లో తన కొడుకు ఫోటోను పోస్ట్ చేసింది. మే 27న రిచాగంగోపాధ్యాయ ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబు కు లూకా షాన్ లాంగెల్లాను అనే పేరును పెట్టినట్టు తెలిపింది.

అదేవిధంగా ప్రెగ్నెన్సీ సమయంలో తనను ఎంతో చక్కగా చూసుకున్న వైద్య సిబ్బందికి కుటుంబ సభ్యులకు థాంక్స్ చెప్పుకోచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ కు స్నేహితులకు తన బాబు ను ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తానా అని ఉందంటూ పేర్కొంది రిచా.

https://www.instagram.com/p/CPtvvgZHtCw/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement