Friday, March 29, 2024

జాతి రత్నాలను మెచ్చిన కేటీఆర్ – హీరో ట్వీట్

అనుదీప్ కె.వి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి ,ప్రియదర్శి ,రాహుల్ రామకృష్ణ ప్రదాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతిరత్నాలు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది.

నాన్ స్టాప్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని చిట్టి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించగా తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జాతి రత్నాలు చిత్రం ఎంతో బాగుంది. ఎంతో ఉల్లాసంగా కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ కు హీరో నవీన్ పోలిశెట్టి కూడా స్పందించారు. థాంక్యూ సార్…మీకు నచ్చడం చాలా హ్యాపీగా ఉంది అంటూ రిప్లై ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement