Friday, April 19, 2024

పక్కా కమర్షియల్ కు కరోనా చెక్

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రాశికన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్. ప్రతి రోజు పండుగే సినిమా తర్వాత మారుతి స్టార్ హీరోస్ కోసం ప్రయత్నించి కుదరకపోవడంతో గోపీచంద్ తో ఈ సినిమాను స్టార్ట్ చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ను నిలిపివేసింది.

కరోనా కేసులు తగ్గగానే షూటింగ్ మళ్లీ మొదలవుతుందని సమాచారం. ఒకవేళ షూటింగ్ జరిపినా ప్రస్తుతం థియేటర్ల మూసివేత, టికెట్ ధరల తగ్గింపు వంటి సమస్యలు ఉండడం వల్ల అనుకొన్న సమయానికి రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మరో వైపు సిటీ మార్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement