Thursday, April 25, 2024

టార్గెట్ హ్యాట్రిక్….శ్రీవాస్ తో గోపిచంద్

లక్ష్యం, లౌక్యం సినిమాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ రెండు సినిమాలు కూడా తెరకెక్కాయి. అయితే ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ శ్రీవాస్ తో గోపీచంద్ సినిమా చేయబోతున్నాడు. ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ప్రస్తుతం సిటిమార్ సినిమా చేస్తున్నాడు. అలాగే పక్కా కమర్షియల్ సినిమా కూడా చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా శ్రీనివాస్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మేర సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం శ్రీనివాస్ స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడట. ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement