Friday, April 26, 2024

మీర్జాపూర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సీజన్-3పై బిగ్ అప్‌డేట్

రెండేండ్ల కింద ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన హిందీ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. అత్యధిక వ్యూయర్ షిప్ ను దక్కించుకున్న సిరీస్ గా పలు అవార్డులను కూడా అందుకుంది. ఈ క్రైమ్ డ్రామాను ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ తమ ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పై రూపొందించారు. ఈ సిరీస్ లో మాఫియా డాన్ గా పంకజ్ త్రిపాఠి, అతని భార్య బీనా త్రిపాఠిగా రసిక దుగల్, కొడుకు మున్నాగా దివ్యేందు, గ్యాంగ్‌స్టర్ గుడ్డు పండిట్‌గా అలీ ఫజల్, గజ్‌గామిని గుప్తా అకా గోలుగా శ్వేతా త్రిపాఠి శర్మ నటించారు. ఈ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సీజన్లతో ఆడియెన్స్ ను మెప్పించింది ఈ వెబ్ సిరీస్.. అన్న, చెల్లిని చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డూ పండిట్ చంపి పగ సాధిస్తాడు. అక్కడితో రెండో సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాత అఖండానంద్, గుడ్డు పండిట్ మధ్య ఏం జరిగిందనేని మూడో సీజన్ తో తెలియాల్సి ఉంది. దీంతో ప్రేక్షకులు ‘మీర్జాపూర్ సీజన్ 3’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో నటుడు అలీ ఫజల్ ఓ క్రేజీ పోస్ట్ తో ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ అందించారు. సీజన్ 3పై అప్డేట్ ఇస్తూ.. షూటింగ్ పూర్తైందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేశాడు అలీ ఫజల్. ఇక అందరూ ఎంతగానో ఎదురుచేస్తున్న ఈ వెబ్ సిరీస్ సీజన్3 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement