Friday, April 26, 2024

భ‌ర్త‌.. కుమారైతో ముంబ‌యి ఎయిర్ పోర్టులో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక‌చోప్రా

త‌న భ‌ర్త‌..కుమారైతో ముంబ‌యి ఎయిర్ పోర్టులో సంద‌డి చేశారు గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక‌చోప్రా. వివాహం తర్వాత లాస్‌ఏంజెల్స్ లో స్థిరపడిన ఆమె అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తుంటారు. ఇందులో భాగంగానే శుక్రవారం భర్త నిక్‌ జొనాస్ ( , కుమార్తె మల్తీ మేరీ చోప్రా జొనాస్ తో కలిసి ముంబై కి చేరుకున్నారు. కాగా, ప్రియాంక కుమార్తెతో కలిసి భారత్‌కు రావడం ఇది మొదటిసారి. తల్లైన తర్వాత గతేడాది ప్రియాంక భారత్‌ వచ్చారు. అయితే అప్పుడు కుమార్తెను వెంట తీసుకురాలేదు. ఇప్పుడు కుమార్తెతో పాటు భారత్‌ వచ్చిన ప్రియాంక.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మల్తీని మీడియాకు చూపిస్తూ సందడి చేశారు. భర్తతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించి పిక్స్‌ ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి. వయసులో తనకంటే పదేండ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్‌ సింగర్ నిక్‌ జొనాస్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్‌ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. అనంతరం 2022 ఏడాదిలో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్‌లోనే ఉంటోంది. పలుహాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్‌ సినిమాలు నిర్మిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement