Thursday, April 18, 2024

ఇష్ట‌మైన ప‌నివ‌ల్లే త్వ‌ర‌గా కోలుకున్నా.. అంద‌రికి థ్యాంక్స్.. సుస్మితాసేన్

త‌న యాంజియోప్లాస్టీ పూర్తి అయ్యి నెల‌రోజులు అయింద‌ని తెలిపింది న‌టి సుస్మితాసేన్.గుండెపోటు నుంచి కోలుకునిమళ్ళీ షూటింగ్ లకు వెళ్తోంది సుస్మితాసేన్.. వర్క్ లో బిజీ బిజీ అవుతుంది. రీసెంట్ గా ఓ ఫ్యాషన్ పరేడ్ లో.. ర్యాంప్ వాక్ లో పాల్గొని సందడి చేయడమే కాకుండా, తాను నటించిన తాళి వెబ్ సిరీస్ డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. తాజాగా కెమెరా ముందుకి వచ్చి షూటింగ్ లో కూడా పాల్గొంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియో పోస్ట్ వేసింది. ఆ వీడియోలో సుస్మితా.. తన ముఖంతో పలు హావభావాలు పలికిస్తూ కనిపిస్తుంది. ఆ పోస్ట్ కింద ఇలా రాసుకొచ్చింది. ఇష్టమైన పని చేయడం వలనే నేను త్వరగా కోలుకోగలిగాను. లైట్స్, కెమెరా, యాక్షన్, మ్యూజిక్.. ఇవన్నీ నా మదిలో రిపీట్ ప్లే అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి థాంక్యూ అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ పోస్ట్ కి అభిమానులు రెస్పాండ్ అవుతూ.. సుస్మితా సేన్ పై తమ అభిమానం, ప్రేమని వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం సుస్మితా సేన్ ఫోస్ట్ సోషల్ మీడియాలు వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement