Tuesday, March 26, 2024

సుకుమార్ కు మాజీ ఎంపీ కృతజ్ఞతలు

కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు సహాయం చేయడానికి చాలామంది సినీస్టార్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కూడా తన వంతుగా తన సొంత ఊరు దగ్గరలో ఉన్న రాజోలులో 40 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తన తండ్రి తిరుపతి నాయుడు జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఇదే విషయమై సుకుమార్ కు మాజీ ఎంపీ హర్షకుమార్ అభినందించారు. ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా వీడియో ని కూడా పోస్ట్ చేశారు. సుకుమార్ గారికి కృతజ్ఞతలు. రాజోలు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్న. ఈ కరోనా కష్టకాలంలో ఆయన అందించిన సాయం మర్చిపోలేనిది. ప్రస్తుత రోజులకు ఏం అవసరమో అది ఇచ్చారు. పది రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. చాలా త్వరగా ఆయన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రభుత్వాలు కూడా చేయలేని ఎంతో కష్టమైన పనిని ఆయన చాలా ఈజీగా చేశారు. ఈ ప్రాంతంపై ఆయనకున్న ప్రేమ అలాంటిది. ఇంత గొప్ప పని చేసిన సుకుమార్ గారికి కోనసీమ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ వీడియో లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement