Thursday, April 25, 2024

Drugs case: ముగిసిన ముమైత్‌ ఖాన్‌ ఈడీ విచారణ..

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ నటి ముమైత్‌ ఖాన్‌ను విచారించారు.. గతంలో ఎక్సైజ్‌ అధికారులు డ్రగ్స్‌ కేసులో ముమైత్‌ను ప్రశ్నించగా.. ఇప్పుడు మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు.. ముమైత్‌ ఖాన్‌ బ్యాంకు ఖాతాలను పరిశీలించి అధికారులు.. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు.. తదితర అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ఎఫ్‌ క్లబ్‌ పార్టీల్లో జరిగిన డ్రగ్స్‌ సరఫరాపై ముమైత్‌ను ప్రశ్నించిన ఈడీ.. ఎఫ్‌ క్లబ్‌ జీఎం, ముమైత్‌ మధ్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానా, రవితేజ, నవదీప్‌లను ప్రశ్నించారు ఈడీ అధికారులు. కాగా ఈ డ్రగ్స్‌ కేసులో 12 మంది సినీప్రముఖులకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. ఇప్పటికే ఎనిమిది మందిని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఈసారి కూడా ప‌టాకుల‌పై బ్యాన్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement