Wednesday, April 24, 2024

లుసిఫర్ కోసం ప్రత్యేక సెట్…వేసేది ఎవరో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లుసిఫర్ రీమేక్ సినిమా చేయబోతున్నాడు. అలాగే వేదాళం సినిమా రీమేక్ కూడా చేయబోతున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం దీనికి వహించబోతున్నాడు.

ఇదిలా ఉండగా లూసిఫర్ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ ను రూపొందించే పనిలో పడ్డారట యూనిట్ సభ్యులు. ఆచార్య సినిమాకు భారీ ఆలయాన్ని సృష్టించిన డిజైనర్ సురేష్ సెల్వరాజన్ ఈ సెట్ ను రెడీ చేస్తున్నారట. ఏదైనా కొత్తదనం ఆనందాన్ని ఇస్తుంది. కొత్త రోజు, కొత్త ప్రారంభం, కొత్త సినిమా కోసం పని ప్రారంభిస్తున్నాను. నేను మరొక అద్భుతాన్ని సృష్టించబోతున్నా అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement