సినిమా ఫీల్డ్ అనేది గ్లామర్ తో కూడుకున్న రంగం..నిత్యం యవ్వనంగా, అందంగా కనిపించాల్సిందే..లేదంటే అవకాశాలు కనుమరుగవుతుంటాయి. అందుకే యాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీల బాట పడుతుంటారు. ఇప్పటికే పలువురు నటీనటులు ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. కాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన యాంటిమ్ సినిమా స్క్రీనింగ్లో దిశా పటానీ పాల్గొంది. ఎల్లో కలర్ క్రాప్ టాప్, డెనిమ్స్ ధరించి ఆమె ఈవెంట్కు వచ్చింది. ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె ముఖం మాత్రం అసాధారణంగా కనపడుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఆమె ఫోటోలు బాగోలేవనే టాక్ వినిపిస్తోంది. దిశా సర్జరీ చేయించుకోకపోతే బాగుండేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్స్ దిశాని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement