Friday, April 19, 2024

డైరెక్టర్ శంకర్ తల్లి మృతి

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి ముత్తులక్ష్మి తనువు చాలించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తులక్ష్మి మంగళవారం మృతి చెందారు. అయితే శంకర్ కు తన తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆ విషయాన్ని ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కాగా ఆమె అంత్యక్రియలను చెన్నైలో నిర్వహిస్తామని పరామర్శ కోసం ఎవరు ఇంటికి రావద్దని శంకర్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు శంకర్ కి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. కాగా శంకర్ ప్రస్తుతం భారతీయుడు2 సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement