Wednesday, April 24, 2024

తన ఒకే ఒక ఫోర్స్ ఎన్టీఆర్ అంటున్న ప్రశాంత్ నీల్!!

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. బర్త్ డే కానుకగా అభిమానులు కోరుకున్నట్టుగానే ప్రశాంత్ నీల్ తో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

అయితే ఇదే విషయమై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రక్తంతో తడిసిన నేల ఒక్కటి మాత్రం గుర్తుకుంటుందని…తన ఒకే ఒక్క ఫోర్స్ ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని చెబుతూనే ఎన్టీఆర్ కు విషెస్ చెప్పారు ప్రశాంత్ నీల్.

https://twitter.com/prashanth_neel/status/1395274100080218115?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement