Friday, April 19, 2024

ఆదిపురుష్ ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ స్పీడ్‌ పెంచాడు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ఒకేసారి మూడు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. అవన్ని కూడా పాన్‌ ఇండియా సినిమాలే. ఇటీవల ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ప్రభాస్‌.. ప్రస్తుతం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.

స్ట్రెయిట్ హిందీ సినిమాగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ షూటింగ్ గత కొంత కాలంగా ముంబైలో సెట్స్ లో జరుగుతోంది. అయితే, ఇటీవల ముంబైలో మళ్లీ కరోనా కేసులు విజృంభించడంతో ఈ చిత్రం షూటింగును నిలిపివేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో దర్శకుడు ఓం రౌత్ క్లారిటీ ఇచ్చారు.

షూటింగ్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశాడు. షూటింగ్ నిర్విరామంగా జరుగుతోందన్నాడు.‘ఆదిపురుష్‌’ టీమ్‌లో ఒకరికి కరోనా వచ్చిందనే వార్తను కూడా పూర్తిగా ఖండించాడు. సెట్‌ ఇప్పటి వరకు ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ జరుపుకుంటున్నామని చెప్పాడు. ఇక రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నాడు. సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement