Thursday, April 25, 2024

అస్వ‌స్థ‌త‌కి గురైయిన.. ది కేర‌ళ స్టోరీ ద‌ర్శ‌కుడు

హీరోయిన్ ఆదాశ‌ర్మ‌తో ది కేర‌ళ స్టోరీ చిత్రాన్ని తెర‌కెక్కించాడు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సుదీప్తో సేన్.. రీసెంట్ గా ఆయ‌న అస్వస్థతకు గురయ్యారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విరామం లేకుండా వరుస ప్రయాణాల కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయన్ని ముంబై లోని కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై దర్శకుడు స్పందించారు. డీహైడ్రెషన్, ఇన్ఫెక్షన్ సమస్యలతో కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుతం అంతా అదుపులో ఉందన్నారు. డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇంటికి పంపమని వైద్యులను కోరనున్నట్లు సుదీప్తో సేన్‌ తెలిపారు. విడుదలకు ముందు నుంచే రాజకీయంగా తీవ్ర వివాదం రేగిన చిత్రం ది కేరళ స్టోరీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement