Thursday, April 25, 2024

నాకు నేనే లాక్ డౌన్ పెట్టుకుంటున్నా…నాగ్ అశ్విన్

నాగ్ అశ్విన్ దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటించబోతోంది. అలాగే బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగ్ అశ్విన్ నిత్యం ఏదో ఒక విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

తాజాగా నాగ్ అశ్విన్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తనకి తాను లాక్ డౌన్ పెట్టుకుంటున్నానని… ప్రభుత్వం లాక్ డౌన్ పెడుతుందో లేదో కానీ నాకు నేను వచ్చే రెండు వారాలు లాక్ డౌన్ పెట్టుకుంటున్నానని అన్నారు. లాక్ డౌన్ అనవసరం సమాధానం కాదు అంటారా ? ఒకసారి బయట పరిస్థితులు, గత నెల నుంచి ఆసుపత్రులు చూడండి. ఎంత మంది ఎలా కష్టపడుతున్నారో.. ఇకనైనా మనం సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకొని డాక్టర్స్ కు కాస్త విశ్రాంతి ఇద్దాం అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement