Friday, March 29, 2024

ఫ్యాన్స్‌లందు పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయా… క్రిష్ జాగర్లమూడి

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం ఈ సినిమాకు సంబందించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే క్రిష్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

ఫ్యాన్స్‌లందు పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయా అన్నది నిజం…. మొన్న షూటింగ్ జరుగుతోంది. లంచ్ టైం లో నోటిఫికేషన్ చూద్దామని ట్విట్టర్ ఓపెన్ చేసి చూశాను. అందులో వచ్చిన మెసేజ్ లు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎండలు బాగా ఉన్నాయి. మా హీరో ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఫ్యాన్స్ నాకు మెసేజ్ చేశారు. పవన్ ఫ్యాన్స్ పవన్ పై ఎంతో అభిమానాన్ని చూపిస్తారో ఆ మెసేజ్ లు చూస్తే అర్థమవుతుందన్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement