Friday, March 29, 2024

బుచ్చిబాబు అల్లుఅర్జున్ ను కలిసింది సినిమా కోసమేనా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలోపుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్ట్ లు గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది . మొదట కొరటాల శివ తో సినిమాని అనౌన్స్ చేశారు బన్నీ. కానీ కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. దీంతో అల్లు అర్జున్ కొరటాల శివ సినిమా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

మరోవైపు బోయపాటి శ్రీను పేరు కూడా తెరపైకి వచ్చింది. తాజాగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల బుచ్చిబాబు అల్లు అర్జున్ ని కలిసినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. అయితే బన్నీని బుచ్చిబాబు సినిమా కోసమే కలిసినట్టు తెలుస్తోంది. మొదట ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించాడు బుచ్చిబాబు. కానీ ఎన్టీఆర్ షెడ్యూల్ ఖాళీగా లేకపోవడంతో బుచ్చిబాబు కన్ను అల్లు అర్జున్ పై పడిందట. బుచ్చిబాబు ఉప్పెన సినిమా టైం లోనే నిర్మాణ సంస్థ మైత్రి టీం కు మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ద్వారా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement