Thursday, April 25, 2024

ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్..

వర్సెటైల్ యాక్టర్ ధనుష్ ప్రస్తుతం వరుస సినీ ప్రాజెక్ట్‌లతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే, ధనుష్ ప్రాజెక్ట్‌లలో అత్యంత క్రేజీ బజ్ ఉన్న సినిమా మాత్రం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ. 1930-40ల నాటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినమా భారీ స్థాయిలో రూపొందుతోంది.

కాగా, ఇవ్వాల మూవీ మేకింగ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. యూనిట్ చేస్తున్న కఠోర శ్రమను ఈ చిన్న వీడియోలో చూడొచ్చు. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ధనుష్ ఎలా ఆకుట్టకుంటాడో చూడాలి. అంతేకుండా ఈ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కూడా భాగమయ్యాడు. సుజల్-ది వోర్టెక్స్ ఫేమ్ నివేదిత సతీష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాకి సత్యజ్యోతి ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తుండటా.. జి.వి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement