Friday, April 19, 2024

శర్వానంద్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్

యంగ్ హీరో శర్వానంద్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మహాసముద్రం సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు ఒకే ఒక జీవితం సినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఇందులో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తెరకెక్కుతోంది.

అలాగే ఇందులో శర్వానంద్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. రష్మిక మందన్న, శర్వా కూడా అడుగుపెట్టారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement