Wednesday, April 24, 2024

ప్రభాస్ తో సినిమా పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దీపికా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ రోజు ప్రాజెక్ట్ కే పేరుతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అమితాబ్ పై కొన్ని కీలక సన్నివేశాలను పదిహేను రోజుల పాటు తెరకెక్కించనున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా దీపికాపదుకునే ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఇది ప్రాజెక్ట్ కే లో మొదటి రోజు. ముందు రాబోయే వాటికోసం ఆలోచిస్తేనే చాలా థ్రిల్లింగ్ గా నాకు అనిపిస్తుంది అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టింది దీపిక.

https://www.instagram.com/p/CRtPm2SsqK5/?utm_medium=copy_link
Advertisement

తాజా వార్తలు

Advertisement