Friday, April 26, 2024

ఇండియాలో ఆక్సిజన్ లేక చావులు…వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియా లో కరోనా ఫస్ట్ వేవ్ కన్నా… సెకండ్ వేవ్ లో ప్రజల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఎంతోమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇదే విషయమై ఆస్ట్రేలియా క్రికెటర్స్, సన్ రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ఆక్సిజన్ కోసం ఇండియా లోని ప్రజలు అల్లాడిపోయారు.

నేను స్వయంగా చూశాను. గ్రౌండ్ నుండి హోటల్ కు వెళుతున్న సమయంలో రోడ్డు పక్కన చూస్తే కరోనా తో మరణించిన వారికి అంత్యక్రియలు చేసేందుకు వారి కుటుంబ సభ్యులు క్యూ కట్టారు. అది చాలా భయంకరమైన విషయం. బయో బబుల్ లో ఉన్నంత వరకు సేఫ్ అనుకున్నాం. కానీ అక్కడ కూడా కేసులు రావడం వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి అనుకున్నామని చెప్పుకొచ్చారు వార్నర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement