Thursday, April 25, 2024

ప్రభుత్వమే కాదు…ప్రజలు కూడా తక్కువ అంచనా వేశారు – నిఖిల్

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది సినీ స్టార్స్ ఇంస్టాగ్రామ్ వేదిక లైవ్ లోకి వచ్చి నెటిజన్స్ తో మాట్లాడుతున్నారు. తాజాగా హీరో నిఖిల్ లైవ్ లోకి వచ్చిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో లాక్‌డౌన్‌ పెట్టక ముందు హైదరాబాద్ రెస్టారెంట్ల బయట చాలా మంది మాస్కులు లేకుండా పార్టీలు చేసుకున్నారు… అనేది వాస్తవం. వాళ్లని చూసి నేను షాక్ కి గురయ్యాను. ఇప్పుడు వాళ్ళు కరోనా తో ఆస్పత్రికి వెళ్లి బెడ్స్, ఆక్సిజన్ లేదు అని ఫోన్లు చేస్తున్నారు.

ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా కరోనా ను తక్కువగా అంచనా వేశారంటూ చెప్పుకొచ్చారు నిఖిల్. అందరూ ఇళ్లలోనే ఉండాలని కుదిరితే…ఎదుటివాడికి సహాయం చేయాలని కోరారు నిఖిల్. ఇక ఇటీవల కాలంలో నిఖిల్ ఎంతోమందికి సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement