Wednesday, April 24, 2024

రవితేజ దర్శకుడికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి అధికమవుతోంది. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు రమేష్ వర్మ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు.

ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా రమేష్ వర్మ తెలిపారు. అలాగే అందరూ తప్పకుండా ధరించాలని అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని కోరారు. సినిమాల విషయానికి వస్తే రమేష్ వర్మ ప్రస్తుతం రవితేజ హీరోగా ఖిలాడి సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement