Thursday, April 18, 2024

సాగరకన్య ఫ్యామిలీకి కరోనా!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి కుటుంబం ఈ మహమ్మారి బారిన పడింది. శిల్పారెడ్డి కి తప్ప కుటుంబంలోని అందరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని శిల్పశెట్టి స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆమె తల్లి సునంద, అత్తమామలు, భర్త పిల్లలు సమీష, వియన్ రాజ్ లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా 10 రోజులుగా ఒక కుటుంబంగా మాకు చాలా కష్టంగా ఉంది. నా అత్తమామలకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తరువాత సమిషా, వియాన్రాజ్, మా అమ్మ, చివరిగా రాజ్… వీరంతా అధికారిక మార్గదర్శకాల ప్రకారం ఇంట్లో వారివారి గదులలో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. డాక్టర్ సలహాను అనుసరిస్తున్నారు.

మా ఇంటి సిబ్బందిలో ఇద్దరికీ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారు కూడా చికిత్స పొందుతున్నారు. దేవుని దయ వలన ప్రతి ఒక్కరూ కోలుకునే దశలో ఉన్నారు. నాకు మాత్రం నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రోటోకాల్ ప్రకారం అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. త్వరగా స్పందించి సత్వర సహాయం అందించినందుకు బిఎంసి అధికారులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. దయచేసి మీ ప్రార్థనలలో మా అందరినీ కొనసాగించండి. మాస్క్ ధరించండి, సురక్షితంగా ఉండండి. కరోనా పాజిటివ్ వచ్చినా రాకపోయినా సానుకూలంగా ఉండండి అంటూ పేర్కొంది శిల్పా శెట్టి.

Advertisement

తాజా వార్తలు

Advertisement