Thursday, April 25, 2024

రష్మీక మందన్న గుండుపై వివాదం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల రష్మిక గుండు తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో రష్మిక ఫ్యాన్స్ అలాంటి కామెంట్లు పెడుతున్న వారిపై మండిపడుతున్నారు. అంతే కాకుండా రష్మిక గుండు తో ఉన్న ఫోటోలు తమిళనాడులోని కొన్ని కొన్ని సెలూన్ షాప్ లలో కూడా కనిపిస్తున్నాయి.

ఇక ఇదే విషయంలో ఆమె ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎక్కువగా రష్మీక గుండు ఫోటోలు షేర్ చేస్తున్న ఇతర కథానాయికల ఫ్యాన్స్ పేజీలకు వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు.తమ అభిమాన హీరోయిన్ ఫొటోలను ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక మందన్న గుండు వివాదం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement