Thursday, April 25, 2024

ముగ్గురు మోసగాళ్లు… శ్రీనివాస్ రెడ్డి మరో ప్రయోగం

ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓవైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కథానాయకుడిగా కూడా కనిపిస్తూ ఉంటాడు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా వంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాకు ముగ్గురు మొనగాళ్లు అంటూ టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి లీడ్ రోల్ చేస్తుండగా… దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement