Friday, March 29, 2024

మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవ !!

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 12 తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియమ్ సినిమాకు రీమేక్ చిత్రం. అయితే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది.

మరోవైపు సంక్రాంతి బరిలో మహేష్ సర్కారు వారి పాట సినిమా కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక 2020లో సంక్రాంతి బరిలో అల్లు అర్జున్, మహేష్ బాబు పోటీపడ్డారు. ఇప్పుడు 2022 లో పవర్ స్టార్, మహేష్ బాబు పోటీ పడబోతున్నారు. దీనితో మరోసారి మెగా ఫ్యాన్స్ ఘట్టమనేని ఫ్యాన్స్ మీరా మేమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటున్నారు. గెలుపు మాదంటే మాదని సవాళ్లు విసురుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement