Thursday, April 18, 2024

ఆచార్య సెకండ్ సాంగ్… రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో సాంగ్ గురించి ఈ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి.

కాగా దీనిపై దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. కరోనా పరిస్థితులు మెరుగు పడ్డాక ఆ సాంగ్ ని విడుదల చేస్తామని కొరటాలశివ అన్నారు. అది ఈ నెలలోనే ఉండవచ్చని కూడా టాక్ నడుస్తోంది. కాగా ఈ రొమాంటిక్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement