Thursday, April 25, 2024

రాధే శ్యామ్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన బుట్టబొమ్మ

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధే శ్యామ్. పీరియాడికల్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొన్ని సన్నివేశాలను రీషూట్ కి ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది.

అయితే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ పై హీరోయిన్ పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చారు. రాధే శ్యామ్ షూట్ ఇంకా ఏడు నుంచి పది రోజులపాటు జరగనుందని… పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగాక రిలీజ్ డేట్ పై నిర్మాతలు క్లారిటీ ఇస్తారని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలే ప్రభాస్ ఇటలీ నుంచి తిరిగి వస్తూ హైదరాబాద్ విమానాశ్రయం లో కనిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement