Tuesday, March 26, 2024

సుడిగాలి సుధీర్ కొత్త మూవీకి క్లాప్

సుడిగాలి సుధీర్‌, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ‘పాగల్‌’ సినిమా ఫేమ్‌ నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహిసున్నారు. చంద్ర శేఖర్‌ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమా ఓపినింగ్‌ ఘనంగా జరిగింది.
ఈ పూజ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు డి. సురేష్‌ బాబు, కె.ఎస్‌ రామారావు, సూర్యదేవర రాధాకృష్ణ, కెఎల్‌ దామౌదర ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి చదల వాడ శ్రీనివాస్‌ క్లాప్‌ కొట్టగా, జెమినీ కిరణ్‌ కెమెరా స్విచాన్‌ చేసారు.

”ఈ సినిమా స్క్రిప్ట్‌ ఏడాది క్రితమే ఫైనల్‌ అయింది. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్‌ చేసాం. ఈ సినిమాకు సంబంధించి బెక్కం వేణుగోపాల్‌ గారే కర్త, కర్మ , క్రియ అన్నీ” అని నిర్మాత తెలిపారు.
దర్శకుడు నరేష్‌ కుప్పిలి మాట్లాడుతూ ”సుధీ ర్‌ గారికి కథ నచ్చి ఒప్పుకున్నారు. మా నిర్మాతలు రాజీ పడకుండా అన్ని చేసి పెట్టారు. లియో మాకు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. మా రచయిత ఫణి థాంక్యూ.” అన్నారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడు తూ ”ఎన్నో హిట్‌ సినిమాలు చేసాను. ఇది కూడా ఒక హిట్‌ సినిమా అవ్వబోతుంది. మీ సపోర్ట్‌ కావాలి. దర్శకుడు నరేష్‌తో నాకు ఏడేళ్ల పరిచయం ఉంది.” అన్నారు. హీరో సుధీర్‌ మాట్లాడుతూ ”నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే. టీ-ం అందరి గురించి ఇదివరకే చెప్పారని” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement