Friday, March 15, 2024

మెగాస్టార్ ఆ విషయంలో వెనక్కి తగ్గుతున్నాడా ?

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా కొద్దిగా బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉండిపోయింది. అది కూడా కంప్లీట్ అవుతుందనుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. అయితే ఈ మిగిలి ఉన్న భాగాన్ని పూర్తిగా పరిస్థితులు చక్కబడ్డాక షూట్ చేయాలని మెగాస్టార్ భావిస్తున్నాడట. అసలు తొందరపడకూడదు అన్న ఆలోచనలో ఉన్నాడట మెగాస్టార్.

దీన్ని బట్టి చూస్తుంటే ఆచార్య బ్యాలెన్ షూట్ పూర్తి చేయటానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి.ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement