Thursday, April 25, 2024

తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అంబులెన్స్ సర్వీస్…నిజమేనా ?

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పేద ప్రజలకు సహాయం చేయడానికి కొంతమంది సినీస్టార్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు. సెకండ్ వేవ్ కారణంగా ఎంతోమంది ఆక్సిజన్ లేక మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి 30 కోట్ల రూపాయలకు పైగా సొంత డబ్బులు ఖర్చు చేసి ఆక్సిజన్ బ్యాంక్ లను ఏర్పాటు చేశాడు.

అలాగే సినీ కార్మికులకు వ్యాక్సిన్ వేయించాడు. ఇప్పుడు మరో మహత్తర కార్యానికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల అంతటా కూడా చిరంజీవి అంబులెన్స్ సర్వీసులను కూడా మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించి ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయమై మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement