Friday, April 19, 2024

స్పార్క్ ఓటీటీ లో మరో చిత్రం

కరోనా కారణంగా డిజిటల్ రంగానికి డిమాండ్ పెరిగింది. ఓటీటీ లో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు సినిమాలు ఓ టి టి లో రిలీజ్ అవుతున్నాయి. తాజాగా రాంగోపాల్ వర్మ తన సహచరులతో కలసి స్పార్క్ ఓటీటీ ప్రారంభించారు. ఈ స్పార్క్ ఓటీటీ లో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఢీ కంపెనీ చిత్రం కూడా రిలీజ్ అయింది.

ఇప్పుడు మరో చిత్రం స్పార్క్ ఓటీటీ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. బిగ్ బాస్ బ్యూటీ దివి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్పార్క్ ఓటీటీ లో మే 28న విడుదల కానుంది. కెవిఎన్ రాకేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కు సాయి కార్తీక్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement