Thursday, March 28, 2024

కర్ణన్ రీమేక్ లో బెల్లంకొండ

అల్లుడు శీను సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమా విజయం సాధించినా కలెక్షన్స్ పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి అంతగా విజయం సాధించలేదు. అయితే ఇటీవల తమిళ రీమేక్ రాక్షసుడు తో మాత్రం మంచి హిట్ ను అందుకున్నాడు శ్రీనివాస్. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనవసరం లేదు.

ఈ రీమేక్ లో అనన్య పాండే నటిస్తోంది. ఇదిలా ఉండగా మరో రీమేక్ చిత్రంలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడట బెల్లంకొండ. ధనుష్ హీరోగా తమిళంలో సూపర్ హిట్ సాధించిన కర్ణన్ రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ మూవీ రైట్స్ ని కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement