Thursday, April 25, 2024

సతీష్ వేగేశ్న తో బెల్లంకొండ బ్రదర్ ?

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్దకొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో తెలుగు సూపర్ హిట్ మూవీ చత్రపతి రీమేక్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆయన సోదరుడు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. కాగా తాజా సమాచారం ప్రకారం ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సతీష్ వేగేశ్న సాయి గణేష్ తో ఓ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే సతీష్ నిర్మాతగా నాంది సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఆ ఉత్సాహంతోనే గణేష్ తో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఓ కొత్త దర్శకుడు దీనిని డైరెక్ట్ చేయబోతున్నాడట. అలాగే యువ దర్శకుడు కృష్ణ చైతన్య కథను ఇస్తున్నారట. ఇక ఈ కొత్త సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement